ధాన్యం మద్దతు ధర కేవలం 60 రూపాయలు పెంచడం దారుణం అని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతుల ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంపు లేదు నాగిరెడ్డి ఆరోపించారు. రైతాంగం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది అని ఆయన అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయన్నారు. ముడిచమురు ధరల పెంపు ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని.. వెంటనే ముడి చమురు ధరలు తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. శాస్త్రీయ విధానంతో మద్దతు ధరలు ప్రకటించాలని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయన్నారు. ముడిచమురు ధరల పెంపు ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని.. వెంటనే ముడి చమురు ధరలు తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. శాస్త్రీయ విధానంతో మద్దతు ధరలు ప్రకటించాలని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. -
0 comments:
Post a Comment