హైదరాబాద్ : నాంపల్లి కోర్టు వద్ద పోలీసుల తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైఎస్ విజయమ్మ నిరసన వ్యక్తం చేశారు. కోర్టు వద్ద పోలీసులు జగన్ కుటుంబ సభ్యుల్ని అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ పరిస్థితి చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందన్నారు. ఇంత నిర్బంధం అవసరమా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. మరోవైపు పోలీసుల వైఖరి పట్ల న్యాయవాదులు కూడా నిరసన తెలిపారు.
|
0 comments:
Post a Comment