కాంగ్రెస్, టీడీపీ తీరుపై వైఎస్ఆర్ సీపీ నాయకురాలు కొండాసురేఖ మండిపడ్డారు. కాంగ్రెస్తో కుమ్మక్కైన ప్రతిపక్షం ఆడుతున్న అబద్ధాలు నా జీవితంలో చూడలేదు అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. జగన్ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, టీడీపీలు కలిసి కోర్టుల్లో కేసులు వేశాయన్నారు. మద్యం, నీలిచిత్రాలంటూ దిగజారి మాట్లాడుతున్నవారికి కొండా సురేఖ సవాల్ విసిరారు. మా నాయకుడు జగన్ ఈ రోజే కాదు.. ఏ రోజు మద్యం ముట్టలేదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలకు అనుమానాలైనా ఉంటే.. రక్త పరీక్షలు చేయిద్దాం.. రండి కొండా సురేఖ సవాల్ చేశారు.
మా నాయకుడిపై మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించకలేకపోతే మీ పార్టీని మూసేస్తారా అని కొండాసురేఖ ప్రశ్నించారు. మీరు చెప్పిన అబద్ధాలకు విజయమ్మ కాళ్లుపట్టుకుని క్షమాపణ అడుగుతారా అని అన్నారు. ప్రజా జీవితంలో మాటలు స్థాయికి, వయసుకు తగ్గట్లు ఉండాలి అని కొండాసురేఖ హితవు పలికారు. ఐఎంజీ, ఎమ్మార్ కేసుల వ్యవహారంలో చంద్రబాబు మేనేజ్ చేసినట్లుగా మరెవరు చేయలేదని ఆమె విమర్శించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం చేస్తూ.. ఈ వ్యవస్థలు దిగజారిన పరిస్థితి చూసి బాధగా ఉంది అన్నారు. ప్రభుత్వం కొనసాగాలంటే అసెంబ్లీలో148 మంది సభ్యుల మద్దతు ఉండాలి అని కాని కాంగ్రెస్కు 146 మంది మాత్రమే ఉన్నారు అని కొండాసురేఖ తెలిపారు.
మా నాయకుడిపై మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించకలేకపోతే మీ పార్టీని మూసేస్తారా అని కొండాసురేఖ ప్రశ్నించారు. మీరు చెప్పిన అబద్ధాలకు విజయమ్మ కాళ్లుపట్టుకుని క్షమాపణ అడుగుతారా అని అన్నారు. ప్రజా జీవితంలో మాటలు స్థాయికి, వయసుకు తగ్గట్లు ఉండాలి అని కొండాసురేఖ హితవు పలికారు. ఐఎంజీ, ఎమ్మార్ కేసుల వ్యవహారంలో చంద్రబాబు మేనేజ్ చేసినట్లుగా మరెవరు చేయలేదని ఆమె విమర్శించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం చేస్తూ.. ఈ వ్యవస్థలు దిగజారిన పరిస్థితి చూసి బాధగా ఉంది అన్నారు. ప్రభుత్వం కొనసాగాలంటే అసెంబ్లీలో148 మంది సభ్యుల మద్దతు ఉండాలి అని కాని కాంగ్రెస్కు 146 మంది మాత్రమే ఉన్నారు అని కొండాసురేఖ తెలిపారు.
0 comments:
Post a Comment