‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

Written By news on Thursday, June 6, 2013 | 6/06/2013

రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో గురు వారం (171వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం బుధవారం ప్రకటించారు. మధురపూడి సమీపంలోని బత్తుల సత్తిరాజు తోట వద్ద నుంచి షర్మిల గురువారం ఉదయం పాదయాత్ర ప్రారంభి స్తారు. 5.9 కిలోమీటర్ల నడక అనంతరం దోసకాయలపల్లి వద్ద మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 8.5 కిలోమీటర్ల మేర పాదయాత్రను కొనసాగిస్తారు. రాజానగరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడే రాత్రి బస. గురువారం మొత్తం 14.4 కిలోమేటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.

పర్యటించే ప్రాంతాలు : బూరుగుపూడి, బూరుగుపూడి జంక్షన్, దోసకాయలపల్లి, నందరాడ, నరేంద్రపురం, రాజానగరం
Share this article :

0 comments: