వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కల్వకుర్తి మండలం కొట్ర సమీపంలో జరగనున్న జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి విజయమ్మ ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.
అలాగే ఆమనగల్లు మండలంలోని కడ్తాల్ లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాళ్ల గణేష్ కుటుంబాన్ని విజయమ్మ పరామర్శించనున్నారు. ఆనంతరం ఆమనగల్లులో మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ ఆ తర్వాత వెల్దండ మండలంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డితో పాటు ముఖ్య నేతలు కేకే మహేందరరెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్రెడ్డి, కొండా సురేఖ, రెహ్మాన్, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, గట్టు రామచందర్రావు, రవీంద్రనాయక్ తదితర రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు. |
Home »
» పాలమూరు జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన
పాలమూరు జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన
Written By news on Saturday, June 29, 2013 | 6/29/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment