న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్న సీబీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్న సీబీఐ

న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్న సీబీఐ

Written By news on Wednesday, June 5, 2013 | 6/05/2013

న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్న సీబీఐ 
‘సాక్షి’ చైతన్యపథంలో వక్తలు

గూడూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదిగా జైలులో అక్రమంగా నిర్బంధించడం ముమ్మాటికీ కుట్రపూరితచర్యేనని పలువురు న్యాయవాదులు, మేధావులు, సామాన్యప్రజలు అభిప్రాయపడ్డారు. కేంద్రం సీబీఐని కీలుబొమ్మలా ఆడిస్తోందన్నారు. ప్రాథమికంగా ఎటువంటి ఆధారాల్లేని కేసులు బనాయించి జగన్‌కు బెయిల్ రాకుండా సీబీఐతో పాటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నాయన్నారు. 

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీ భవన్‌లో మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో చైతన్యపథం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రజాదరణ పొందిన నేత అయ్యారు. అసమర్థ పాలనతో కుదేలవుతున్న అధికార కాంగ్రెస్, కుదేలైన టీడీపీ కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిపై కేవలం ఆరోపణలతోనే ఏడాదిగా జైల్లో ఉంచడం దారుణమన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సీబీఐని, న్యాయవ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్నే అవహేళన చేస్తున్నాయన్నారు. సోనియాగాంధీ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎదురు తిరిగినందుకే సీబీఐని ఉపయోగించి జగన్‌పై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. 

ఈ కేసులు ఆయన్నేమీ చేయలేవని, త్వరలో కడిగిన ముత్యంలా జగన్ నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అనేక కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిని పట్టించుకోని సీబీఐ, కేవలం ఆరోపణలకు సంబంధించి జగన్‌పై ఏళ్లతరబడి విచారణ చేయడం, ఏడాదిగా జైలులో నిర్బంధించడం ఏమిటని ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ అహర్నిశలు కృషి చేశారన్నారు. ఆయన అకాల మరణాన్ని తట్టుకోలేక ఎందరో అభిమానంతో మృతి చెందారని, వారిని ఓదారుస్తానని జగన్‌మోహన్‌రెడ్డి మాటిచ్చి ఓదార్పుయాత్ర చేపట్టారన్నారు. అదే పెద్ద తప్పన్నట్లు కాంగ్రెస్ పెద్దలు జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులను వేధించడం సబబు కాదన్నారు. కాంగ్రెస్ పెద్దలు జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచాక బహిరంగసభల్లో మాట్లాడుతూ, జగన్ పార్టీ వీడకుంటే సీఎం అయ్యేవాడంటూ చెప్పడాన్ని బట్టే ఇది ఎంత కుట్రపూరిత చర్యో తెలుస్తుందన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు ఖాదర్‌బాషా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గద్దె దిగకుండా చంద్రబాబు వెన్నుదన్నుగా నిలుస్తుండడాన్ని బట్టే కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు తెలుస్తోందన్నారు. సీబీఐని పావుగా వాడుకుంటూ జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తున్నాయన్నారు. న్యాయవాది బాబురెడ్డి మాట్లాడుతూ, న్యాయస్థానాలు సీబీఐని తప్పుబడుతున్నా.. వారికి చలనమే లేదన్నారు. ఎలాంటి కేసుకైనా అరెస్టయిన 90 రోజుల్లో బెయిల్ రావాల్సి ఉండగా ఏడాదిగా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచడం ముమ్మాటికీ కుట్రేనన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అన్నారు. స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=611984&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: