ఏడాదిగా జైల్లో నిర్బంధంలో ఉన్నా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో ధైర్యంగా, నిబ్బరంగా ఉన్నారని పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్, చంచల్గూడ జైల్లో ఉన్న జగన్మోహన్రెడ్డిని బుధవారం రాజమోహన్ రెడ్డి, ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ములాఖత్ ద్వారా కలిశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై తావుు జగన్తో చర్చించినట్లు మేకపాటి ఈ సందర్భంగా చెప్పారు. వచ్చే సెప్టెంబర్లో కచ్చితంగా జగన్ బెయిల్పై విడుదలై, రాష్ట్రానికి నాయకత్వం వహిస్తారని ఆయున అన్నారు. వుంత్రిపదవినుంచి డీఎల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్ విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు మేకపాటి బదులిస్తూ కాంగ్రెస్ గందరగోళంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు.
Home »
» రాష్ట్రానికి త్వరలోనే జగన్ సారథ్యం : మేకపాటి
రాష్ట్రానికి త్వరలోనే జగన్ సారథ్యం : మేకపాటి
Written By news on Thursday, June 6, 2013 | 6/06/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment