వైఎస్ షర్మిల మంగళవారం ఉదయం విశాఖ జిల్లా శృంగవరం నుంచి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో వైఎస్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 190వ రోజుకు చేరింది.
గాంధీనగరం, తాండవ జంక్షన్, డి. ఎర్రవరం, ములగపూడి, మెట్టపాలెం, బెన్నవరం మీదుగా యాత్ర సాగుతుంది. మొత్తమ్మీద షర్మిల ఈరోజు 12.7 కిలోమీటర్లు నడవనున్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిన్న సాయంత్రం విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
గాంధీనగరం, తాండవ జంక్షన్, డి. ఎర్రవరం, ములగపూడి, మెట్టపాలెం, బెన్నవరం మీదుగా యాత్ర సాగుతుంది. మొత్తమ్మీద షర్మిల ఈరోజు 12.7 కిలోమీటర్లు నడవనున్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిన్న సాయంత్రం విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment