జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలంటూ వైఎస్ఆర్ జిల్లా చెన్నూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కడప మాజీ మేయర్ రవీంద్రనాధ్ రెడ్డితో పాటు పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్ బాబు పాల్గొన్నారు. అధికారులు తక్షణమే ఇళ్ల పట్టాలు కేటాయించి, మౌలిక వసతులు కల్పించాలని సురేష్ బాబు డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ హాయంలో అభివృద్ధికి నమూనాగా నిలిచిన జిల్లా ఇప్పుడు అట్టడుగు స్థాయికి చేరుకుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు కేటాయించిన స్థలాలను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుంటున్నారని మాజీ మేయర్ రవీంద్రనాధ్ రెడ్డి ఆరోపించారు. పాలక ప్రతిపక్షాలకు ప్రజా సంక్షేమం కంటే జగన్ మోహన్రెడ్డిని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా మారిందని ఆయన విమర్శించారు.
వైఎస్ఆర్ హాయంలో అభివృద్ధికి నమూనాగా నిలిచిన జిల్లా ఇప్పుడు అట్టడుగు స్థాయికి చేరుకుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు కేటాయించిన స్థలాలను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుంటున్నారని మాజీ మేయర్ రవీంద్రనాధ్ రెడ్డి ఆరోపించారు. పాలక ప్రతిపక్షాలకు ప్రజా సంక్షేమం కంటే జగన్ మోహన్రెడ్డిని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా మారిందని ఆయన విమర్శించారు.
0 comments:
Post a Comment