వలసలను ఆపుకోవడానికి దొంగనాటకాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వలసలను ఆపుకోవడానికి దొంగనాటకాలు

వలసలను ఆపుకోవడానికి దొంగనాటకాలు

Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013

తెలుగుదేశంపార్టీపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో మండిపడ్డారు. ఆపార్టీ నుంచి వెళ్లుతున్న వలసలను ఆపుకోవడానికి తెలుగుదేశం దొంగనాటకాలు అడుతుందని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే ఆపార్టీ ఎస్ ఎంఎస్ రాజకీయానికి తెర తీసిందని భూమన వెల్లడించారు. 

దొంగ సర్వేలు చేయించి టీడీపీ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలవబోతోందంటూ ఎస్ ఎంఎస్ ల ప్రచారం చేస్తుందన్నారు. దీనికి చంద్రబాబు తనయుడు ట్వీట్టేష్ బాబు సారథ్యం వహిస్తున్నారని తెలిపారు. ట్విట్టేష్ బాబు దొంగ సర్వేలను ప్రజలెవ్వరు నమ్మరని భూమన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 190 సీట్లు గెలుస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్న సంగతిని భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Share this article :

0 comments: