వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో బుధవారం (177వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి మంగళవారం ప్రకటించారు. జి. మామిడాడ నుంచి బుధవారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. 6.9 కిలోమీటర్ల నడక అనంతరం పెదపూడి సమీపంలో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 8.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. అచ్యుతాపురం సమీపంలో రాత్రి బస చేస్తారు. బుధవారం మొత్తం 15.5 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.
పర్యటించే ప్రాంతాలు: జి. మామిడాడ, శివారు లక్ష్మీనరసింహాపురం, పెద్దాడ, పెదపూడి, దోమాడ, కరకుదురు, అచ్యుతాపురం.
పర్యటించే ప్రాంతాలు: జి. మామిడాడ, శివారు లక్ష్మీనరసింహాపురం, పెద్దాడ, పెదపూడి, దోమాడ, కరకుదురు, అచ్యుతాపురం.
0 comments:
Post a Comment