ప్రజల ఆశలన్నీ జగన్‌పైనే: గ్రంధి శ్రీనివాస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల ఆశలన్నీ జగన్‌పైనే: గ్రంధి శ్రీనివాస్

ప్రజల ఆశలన్నీ జగన్‌పైనే: గ్రంధి శ్రీనివాస్

Written By news on Saturday, June 15, 2013 | 6/15/2013

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం ఖాయమని భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన శనివారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. ఈ సందర్భంగా జైలు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చగలడని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు.

మహానేత చేపట్టిన సంక్షేమ పథకాలు తిరిగి జగన్ నాయకత్వంలో ప్రజలకు నేరుగా అందుతాయన్నారు. దర్యాప్తు పేరుతో నెలల తరబడి జైల్లో పెట్టడం సరికాదన్నారు. చార్జిషీట్లను అడ్డుపెట్టుకొని ఎన్నికల వరకు జగన్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆకాంక్ష మేరకు జగన్ త్వరలో నిర్దోషిగా విడుదలవుతారన్నారు. జగన్‌ను కలిసిన వారిలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ ఇంద్రకిరణ్‌రెడ్డి కూడా ఉన్నారు.




గుంటూరు: ఈ ప్రభుత్వంలో కరెంట్‌ను కాదు బిల్లు పట్టుకుంటేనే షాక్‌ కొడుతోందని వైఎస్‌ఆర్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. 2014లో ఓటమితో చంద్రబాబు మూడో హ్యాట్రిక్‌ సాధించబోతున్నాడని చెప్పారు. 

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. పత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత, జంగా కృష్ణమూర్తి, మర్రి రాజశేఖర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: