పేద ప్రజలంటే సీఎంకు కనికరం లేదు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేద ప్రజలంటే సీఎంకు కనికరం లేదు: షర్మిల

పేద ప్రజలంటే సీఎంకు కనికరం లేదు: షర్మిల

Written By news on Sunday, June 2, 2013 | 6/02/2013

పేద ప్రజలంటే సీఎం కిరణ్‌కు కనికరంలేదు, మనసు, మానవత్వం లేదు అని షర్మిల మండిపడ్డారు. రైతులకు భరోసా ఇచ్చే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు అని అన్నారు. చంద్రబాబు హయాం నరకప్రాయమైతే...వైఎస్ హయాం సువర్ణయుగమని, అన్ని వర్గాల ప్రజలకోసం ఆలోచించిన ఘనత వైఎస్‌ఆర్‌ది అని అన్నారు. వేతనాలు పెంచాలని అడిగిన అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించారని, 50 రూపాయలున్న హార్స్‌పవర్‌ను 625లకు పెంచిన ఘనుడు చంద్రబాబు అన్నారు. 

సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులౌతారని, స్కాలర్‌షిప్‌లు అడిగిన విద్యార్థులను లాఠీలతో కొట్టించిన సీఎం.. చంద్రబాబు అన్నారు. వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే పేదలనుంచి కూడా యూజర్‌ ఛార్జీలు వసూలుచేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మంచివారనుకుని ఎన్టీఆర్‌ పిల్లనిచ్చి పెళ్లిచేశారని.. అయితే ఆయన కుర్చీని, అధికారాన్ని, పార్టీని చంద్రబాబు కాజేశారని షర్మిల అన్నారు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌నే పార్టీ నుంచి గెంటేసిన ఘనత చంద్రబాబుది అని విమర్శించారు. ఈ నక్కజిత్తుల చంద్రబాబుకు పదవీవ్యామోహం రక్తంలోనే ఉందని పిల్లనిచ్చిన ఎన్టీఆరే వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రజలకు తెలిసారు - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=610640&Categoryid=14&subcatid=0#sthash.VR1TNA0A.dpuf
Share this article :

0 comments: