రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఆదివారమిక్కడ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఎంఈవో, డీవైఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళపతి , కార్యవర్గ సభ్యులు కె.జాలిరెడ్డి, ప్రకాశ్రావు, రామసుబ్బారావు, రమేష్, పి.దామోదరం, కె.గురుప్రసాద్, అశోక్కుమార్ రెడ్డి, దయాకర్, శంకర్రావు, ఉస్మాన్, గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Home »
» టీచర్ల సమస్యలు పరిష్కరించాలి: వైఎస్సార్ టీఎఫ్
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి: వైఎస్సార్ టీఎఫ్
Written By news on Monday, June 24, 2013 | 6/24/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment