హైదరాబాద్: వైఎస్సాసీపీ జెండాలో ఉన్న పథకాలన్నీ కాంగ్రెస్ పథకాలన్న వ్యాఖ్యలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. అలాయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ పథకాలు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ పథకాలకు తూట్లు పొడుస్తున్న మీకు మమ్మల్ని ప్రశ్నించే హక్కుందా అని నిలదీశారు.
వైఎస్ జగన్ ములాఖత్లపై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. యనమల రామకృష్ణుడు జైళ్ల మాన్యువల్ను ఒకసారి చదవుకుంటే మంచిదని హితవు పలికారు. టీడీపీ రాద్ధాంతం వల్ల వాస్తవంగా జగన్కు ఉండాల్సిన ములాఖత్లు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బొత్స ఏనాడైనా ఆయన పార్టీ పూర్తిపేరు ఉచ్చరించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడి పేరు బొత్స చెప్పగలరా అన్నారు. బొత్స రాజకీయ పరిజ్ఞానం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని భూమన అన్నారు |
Home »
» 'జగన్ ములాఖత్లపై అనవసర రాద్ధాంతం'
'జగన్ ములాఖత్లపై అనవసర రాద్ధాంతం'
Written By news on Monday, June 3, 2013 | 6/03/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment