వైఎస్ అభిమాని ఆత్మబలిదానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ అభిమాని ఆత్మబలిదానం

వైఎస్ అభిమాని ఆత్మబలిదానం

Written By news on Saturday, June 15, 2013 | 6/15/2013


 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదికి పైగా అక్రమంగా జైలులో నిర్బం ధించడాన్ని జీర్ణించుకోలేని ఓ అభిమాని ఆత్మబలిదానం చేసుకున్నాడు. వివరాలు.. నర్సాపూర్‌లోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన పొట్టి వీరారెడ్డి(32) గురువారం రాత్రి అదే కాలనీ లోని మాచర్ల రాజు ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరారెడ్డి కొంతకాలంగా జిన్నారం మండలంలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మృతుడి జేబులో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా 375 రోజులుగా జైలులో పెట్టడంతో వైఎస్సార్ అభిమానిగా ఆత్మబలిదానం చేసుకుంటున్నట్లు రాసి కింద తన పేరు రాశాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ అసెంబ్లీ టికెట్‌ను కొండా సురేఖ అక్కకు ఇవ్వాలని, వైఎస్ విజయమ్మ, కొండా సురేఖ, వైఎస్.భారతి, షర్మిలక్క తన అంత్యక్రియల్లో పాల్గొనాలని నోట్‌లో కోరాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: