ఆ మాట నాడెందుకు చెప్పలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ మాట నాడెందుకు చెప్పలేదు

ఆ మాట నాడెందుకు చెప్పలేదు

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

నాడు హైకోర్టులో అఫిడవిట్ వేయలేదెందుకు?
జీవోలన్నీ సక్రమైనప్పుడు క్విడ్‌ప్రోకో ఎలా సాధ్యం?

సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాము జారీ చేసిన జీవోలన్నీ నిబంధనలకు అనుగుణంగానే జారీ చేశామని ఇప్పుడు చెబుతున్న మంత్రులు.. ఆనాడు అదే విషయాన్ని హైకోర్టు అడిగినప్పుడు మాత్రం దానిపై ఎందుకు అఫిడవిట్‌దాఖలు చేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రశ్నించింది. ఆ జీవోలన్నీ సక్రమమైనప్పుడు క్విడ్ ప్రో కో ఎలా సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. 

సోమవారం శాసనసభ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, కె. శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు అసెంబ్లీ మీడియాపాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘కళంకితులంటే బాధపడుతున్నారు. తామిచ్చిన జీవోలన్నీ బిజినెస్ రూల్స్ ప్రకారం మంత్రివర్గంలో సమష్టిగా తీసుకున్న నిర్ణయాలేనని మంత్రులు చెబుతున్నారు. మరి అప్పట్లో రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేసినప్పుడు ఇదే విషయాన్ని ఎందుకు చెప్పలేదో మాకు అర్థం కావడం లేదు. చట్ట ప్రకారమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు జగన్‌ను జైలులో పెట్టడం ఎందుకు? ఇది కుట్ర కాదా?’ అని కాపు రామచంద్రారెడ్డి నిలదీశారు. సోమవారం అసెంబ్లీలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గీతారెడ్డిలు చెప్పిన మాటలను బట్టి ఆ జీవోలన్నీ మంత్రివర్గ సమష్టి నిర్ణయాలేనన్న విషయం స్పష్టమైందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. 

వైఎస్ కుటుంబాన్ని వెలివేయాలని గతంలో వ్యాఖ్యానించిన ఆనం రామనారాయణరెడ్డిలో మనుషులకుఉండాల్సిన గుణాలు లేవని.. ఏ కోర్టు చెప్పకుండానే వైఎస్ కుటుంబాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా వైఎస్ గానీ, మంత్రిగా తానుగానీ రెండు ఎకరాల భూమి కంటే ఎక్కువ ఇవ్వలేమని, వివిధ సంస్థలకు జరిగిన భూ కేటాయింపులన్నీ కేబినెట్ సమష్టి నిర్ణయాలేనని గతంలో ధర్మాన ప్రసాదరావు చెప్పారని జూపూడి గుర్తు చేశారు. ‘అవన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రివర్గం సమష్టిగా తీసుకున్న నిర్ణయాలని అసెంబ్లీలో చెప్పిన మంత్రి గీతారెడ్డి.. ఇదే విషయాన్ని బయట ప్రజలకు కూడా చెప్పాలి’ అని సూచించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో ప్రజాదరణ పెరుగుతోందని భయపడే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు అయి ఒకరికొకరు సహకరించుకుంటూ వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నాయని శ్రీనివాసులు ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయం బట్టబయలైందన్నారు. అయితే.. తమకు ఒకరంటే ఒకరికి పడదని ప్రజలను నమ్మించడానికే కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఒకరినొకరు తిట్టుకుంటున్నట్టు నాటకాలు ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు.
Share this article :

0 comments: