వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పలు అంశాలపై లేఖ రాశారు. ఇందిర క్రాంతి పథం సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆ లేఖలో తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు పెరగడం లేదని పేర్కొన్నారు. హేతుబద్ధమైన ఐకేపీ ఉద్యోగుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 108 ఉద్యోగుల భవితవ్యం అగమ్యగోచరంగా ఉందని తెలిపారు. తమ డిమాండ్లపై నోరెత్తినందుకు వారిపై అక్రమ కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. వారిని సస్పెన్షన్లకు గురి చేశారు. బదిలీలు కూడా చేశారని తెలిపారు. నిత్యావసరాలు ఆకాశాన్నంటున్నా 108 ఉద్యోగుల జీతాలు పెరగడం లేదు. ఇప్పటికైనా చొరవ తీసుకుని వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. \
Home »
» సీఎం కిరణ్కు విజయమ్మ లేఖ
సీఎం కిరణ్కు విజయమ్మ లేఖ
Written By news on Friday, June 21, 2013 | 6/21/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment