దొంగలతో బాబు దోస్తీ: భూమన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దొంగలతో బాబు దోస్తీ: భూమన

దొంగలతో బాబు దోస్తీ: భూమన

Written By news on Saturday, June 22, 2013 | 6/22/2013

ఐఎంజీ భూ కేటాయింపుల్లో అవకతవకలే లేకపోతే.. దానిపై చంద్రబాబే స్వయంగా విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు దొంగలు, దోపిడీదారులతో చేతులు కలిపారని.. ఐఎంజీ అవకతవకలపై తాము ఆధారాలను బయటపెడితే సిగ్గు లేకుండా ఆ పార్టీ ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి భూమన శుక్రవారం అసెంబ్లీ వద్ద మాట్లాడారు. వైఎస్‌కు బిల్లీరావుతో సంబంధం ఉందంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. వైఎస్‌కు, బిల్లీరావుకు సంబంధం ఉందంటూ టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ అంతకు ముందు ఆరోపించారు. దీన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. 

ఇజ్రాయెల్‌లో అధికారిక సమావేశంలోకి దొంగలా బిల్లీరావు రావడంపై వైఎస్ ఆనాడు అక్కడే నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. దీనిపై చంద్రబాబు శాసనసభలో ఫోటోలు ప్రదర్శిస్తే వైఎస్ సమగ్ర వివరణ కూడా ఇచ్చారన్నారు. యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ నుంచి రూ.కోట్ల ఫండ్ తీసుకోవడం, దొంగనోట్లు ముద్రిస్తూ పట్టుబడిన రామకృష్ణగౌడ్‌తో ఫోటోలు దిగడం, స్టాంపుల కుంభకోణంలో జైలుశిక్ష అనుభవించిన కృష్ణయాదవ్‌తో సంబంధాలు.. ఇలా ప్రతీ రంగంలో చంద్రబాబుకు భాగం ఉందన్నారు. వైఎస్ తండ్రి రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు చంద్రబాబు తన నివాసంలో నెల రోజులు ఆశ్రయం కల్పించారని ఆరోపించారు. 
Share this article :

0 comments: