Home »
» వైఎస్సార్ సీపీలో చేరిన కంచెట్టి గంగాధర్
వైఎస్సార్ సీపీలో చేరిన కంచెట్టి గంగాధర్
సాక్షి, హైదరాబాద్: ఆర్మూర్ మున్సిపాలిటీ తాజా మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, మాజీ కౌన్సిలర్లు పూల నర్సయ్య, పాన్ శ్రీనివాస్ బుధవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. వీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా పర్యట నకు బయలుదేరడానికి ముందు వీరంతా విజయమ్మను కలుసుకుని తమ అభీష్టా న్ని వ్యక్తం చేయడంతో.. ఆమె వారికి కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
|
|
0 comments:
Post a Comment