వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో మద్దతు రావడం ఆసక్తికరంగా ఉంది.జగన్ పై సిబిఐని ఉసికొల్పారని అకాలీదళ్,బిజెపి నేతలు వ్యాఖ్యానించడం నైతికంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు కొంత ఉపశమనం కలిగించే అంశమే. ఇంతవరకు జాతీయ స్థాయిలో జగన్ కు ఎవరూ పెద్దగా మద్దతు ఇచ్చిన దాఖలా లేదు. శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగిన జగన్ను అణగదొక్కడానికే సిబిఐని కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని శిరోమణి అకాళీదళ్ నేత, మాజీ ప్రధాని కుమారుడు నరేష్ గుజ్రాల్ వ్యాఖ్యానించారు.అలాగే బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా జగన్ కొత్త పార్టీని పెట్టుకున్నందునే కాంగ్రెస్ పార్టీ సిబిఐని ఉసికొల్పిందని అభిప్రాయపడ్డారు.సిబిఐని దుర్వినియోగం చేయడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు
Kommineni
0 comments:
Post a Comment