తమపై వచ్చినవి ఆరోపణలేనని, ఏ కోర్టు తమని దోషిగా ప్రకటించలేదని అంటున్న మంత్రులు.. కేబినెట్ సమిష్టి నిర్ణయాన్ని న్యాయస్థానానికి ఎందుకు తెలపలేదని వైఎస్ఆర్ సీపీ నేతలు కాపురామచంద్రారెడ్డి, జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకు అఫిడవిట్ వేయలేదని నిలదీశారు. ఆరోపణలతోనే జగన్ జైల్లో ఉన్నారు... అంటే జగన్ను జైల్లో ఉంచడం కుట్ర కాదా అని ప్రశ్నించారు.
కేబినెట్ సమిష్టి నిర్ణయాలంటున్న మంత్రి ఆనం.. వైఎస్ కుటుంబాన్ని వెలివేయాలని ఎందుకంటారని నిలదీశారు. మంత్రిగా కాదుకదా మనిషిగా ఉండే గుణం ఆనంకు లేదన్నారు. ప్రభుత్వం ద్వంద్వ విధానాలు విడనాడాలని హితవు పలికారు. ప్రభుత్వం కక్ష సాధింపుతో శిక్షించాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పతనావస్థలో ఉందని కాపు రామచంద్రారెడ్డి, జూపూడి అన్నారు.
కేబినెట్ సమిష్టి నిర్ణయాలంటున్న మంత్రి ఆనం.. వైఎస్ కుటుంబాన్ని వెలివేయాలని ఎందుకంటారని నిలదీశారు. మంత్రిగా కాదుకదా మనిషిగా ఉండే గుణం ఆనంకు లేదన్నారు. ప్రభుత్వం ద్వంద్వ విధానాలు విడనాడాలని హితవు పలికారు. ప్రభుత్వం కక్ష సాధింపుతో శిక్షించాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పతనావస్థలో ఉందని కాపు రామచంద్రారెడ్డి, జూపూడి అన్నారు.
0 comments:
Post a Comment