సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి వచ్చాకే జగన్ కేసు విచారించాలి : తెలంగాణ లోక్‌సత్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి వచ్చాకే జగన్ కేసు విచారించాలి : తెలంగాణ లోక్‌సత్తా

సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి వచ్చాకే జగన్ కేసు విచారించాలి : తెలంగాణ లోక్‌సత్తా

Written By news on Saturday, June 8, 2013 | 6/08/2013

సీబీఐ, ఈడీలకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాకే వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసు విచారణ జరిపితే మంచిదని తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు కంచర్ల ధర్మారెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. జగన్‌పై పలు అభియోగాలు మోపుతున్న సీబీఐ, ఈడీలకు ప్రస్తుతం స్వయం ప్రతిపత్తి లేదని, ఆ రెండు సంస్థలు అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అవినీతిని తెలంగాణ లోక్‌సత్తా పార్టీ ఎప్పుడూ సమర్థించబోదని.. అయితే ఈ కేసులో అధికార పార్టీ ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కుతోందని అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: