Home »
» lనాంపల్లి సిబిఐ కోర్ట్ కి చేరుకున్న జగన్
lనాంపల్లి సిబిఐ కోర్ట్ కి చేరుకున్న జగన్
నాంపల్లి సిబిఐ కోర్ట్ కి చేరుకున్న జగన్
న్యాయవాదులనూ అడ్డుకున్న పోలీసులు
|
|
|
నాంపల్లి కోర్టు వద్ద పోలీసుల నిర్బంధం కొనసాగింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. చాలాసేపు వారిని కోర్టు గేటు వద్ద నిలువరించారు. అంతేకాకుండా విధులకు హాజరవుతున్న న్యాయవాదులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో తమను కోర్టుకు హాజరు కానివ్వరా అంటూ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు తమ అభిమాన నేత వైఎస్ జగన్ ను చూసేందుకు చంచల్ గూడ జైలు వద్దకు వచ్చిన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వారిపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. దాంతో పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్న మార్గంలోనూ పోలీసులు నిర్భంధం విధించారు. జగన్ ను చూసేందుకు వస్తున్నవారికి పలు చౌరస్తాల వద్ద అడ్డంకులు పెట్టారు. దాంతో పోలీసుల తీరును వారు తీవ్రంగా నిరసించారు.
|
|
0 comments:
Post a Comment