వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రేపటికి మూడు వేల కిలోమీటర్ల మైలురాయి అధిగమించనుంది. ఆగస్ట్ 4న పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో మహాముగింపు సభ నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి చెప్పారు.
ప్రపంచంలో ఏ మహిళ చేయని విధంగా షర్మిల పాదయాత్ర సాగిందన్నారు. ఇచ్చాపురంలో జరిగే మహాముగింపు సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ శ్రేణులు హాజరుకావాలని ఆయన పిలుపు ఇచ్చారు.
ఢిల్లీలో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేస్తారో, ఎంత చిన్నాభిన్నం చేస్తారోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని దారుణంగా కించపరుస్తున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటూ, గందరగోళం సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. వైఎస్ఆర్ సీపీలో ఎవరికీ అన్యాయం జరగదని, అపోహలన్నీ తొలగిపోతాయని చెప్పారు.
ప్రపంచంలో ఏ మహిళ చేయని విధంగా షర్మిల పాదయాత్ర సాగిందన్నారు. ఇచ్చాపురంలో జరిగే మహాముగింపు సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ శ్రేణులు హాజరుకావాలని ఆయన పిలుపు ఇచ్చారు.
ఢిల్లీలో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేస్తారో, ఎంత చిన్నాభిన్నం చేస్తారోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని దారుణంగా కించపరుస్తున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటూ, గందరగోళం సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. వైఎస్ఆర్ సీపీలో ఎవరికీ అన్యాయం జరగదని, అపోహలన్నీ తొలగిపోతాయని చెప్పారు.
0 comments:
Post a Comment