వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 208వ రోజు(జిల్లాలో ఆరో రోజు) సాగే వివరాలను పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు శుక్రవారం ప్రకటించారు. శని వారం ఉదయం మిమ్స్ మెడికల్ కళాశాల జంక్షన్, నెల్లిమర్లలో పాదయాత్ర చేసిన తరువాత నెల్లిమర్లలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. విరామం తరువాత నెల్లిమర్ల రైల్వే స్టేషన్, గుర్ల, కెల్ల జంక్షన్, గుజ్జింగ వలసల్లో పాదయాత్ర చేసిన అనంతరం రాత్రి బస చేస్తారు.
జిల్లాలో ఆరో రోజు పర్యటించే ప్రాంతాలు
మిమ్స్ కళాశాల జంక్షన్, నెల్లిమర్ల,
నెల్లిమర్ల రైల్వేస్టేషన్, గుర్ల, కెల్ల జంక్షన్, గుజ్జింగవలస
జిల్లాలో ఆరో రోజు పర్యటించే ప్రాంతాలు
మిమ్స్ కళాశాల జంక్షన్, నెల్లిమర్ల,
నెల్లిమర్ల రైల్వేస్టేషన్, గుర్ల, కెల్ల జంక్షన్, గుజ్జింగవలస
0 comments:
Post a Comment