దుష్టపాలనకు చరమగీతం: భూమన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దుష్టపాలనకు చరమగీతం: భూమన

దుష్టపాలనకు చరమగీతం: భూమన

Written By news on Monday, July 22, 2013 | 7/22/2013

ప్రజాసమస్యలపై తిరుగుబాటు పేరుతో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆదివారం తిరుపతిలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ దుష్టపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తిరుపతిలోని మద్యం దుకాణాల్లో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలకు వేలాదిమంది జనం రావడం చూసి బొత్స, చంద్రబాబులకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. అందుకే పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైఎస్ హయాంలోని స్వర్ణయుగం పాలన మరెంతో దూరంలో లేదని భూమన చెప్పారు. 
Share this article :

0 comments: