ప్రజాదరణ పెరుగుతుందే తప్ప తరగదు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాదరణ పెరుగుతుందే తప్ప తరగదు...

ప్రజాదరణ పెరుగుతుందే తప్ప తరగదు...

Written By news on Saturday, July 6, 2013 | 7/06/2013

పెద్దాయన... పెద్దాయన... ఇది స్వార్థపు లోకం పెద్దాయన! ఇది నిజం.. ప్రజలందరికి తెలిసిన సత్యం. వైయస్ బతికి ఉండగా జేజేలు కొట్టారు. వైయస్ అడుగులో అడుగు వేశారు, స్వరంలో స్వరం కలిపారు.. వైయస్ జిందాబాద్, వైఎస్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ సభలు, సమావేశాల్లో నినాదాలు చేసిన వారు మహానేత లేడు, ఇక తిరిగి రాలేడు అని తెలిసి తమ స్వార్థ ప్రయోజనాల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ పదవులు కాపాడుకోవడానికి స్వరం మార్చారు. రోజుకో మాట, పూటకో అబద్ధం మాట్లాడుతున్నారు.

ఇలాంటి రాజకీయ నాయకులకు రానున్న రోజుల్లో పుట్టగతులు ఉండవు. వారికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయి. వారికి నీతి, నిజాయితీ ఉంటే గుండెల మీద చేయి పెట్టుకుని చెప్పమనండి. డా.వైయస్. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మా పథకాలు అని చెప్పుకోవడానికి యుపిఏ ప్రభుత్వానికి, ఢిల్లీ పెద్దలకు సిగ్గులేదా? పథకాలు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెడితే భారతదేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేవు? వైయస్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేద, మధ్య తరగతి వారికోసమే. ఈ పథకాల వల్ల ఎందరో లబ్ధిపొందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు 108 అంబులెన్స్ వలన ఎంతోమంది ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఇప్పుడు కొన్ని పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. మరికొన్ని జనాకర్షణ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. సీబీఐ సంస్థకు దమ్మూ ధైర్యం ఉంటే ముందు సోనియాగాంధీపై విచారణ చేయండి. యూపీఏ పెద్దలపై విచారణ చేయాలి.

యూపీఏ ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయింది అని ఢిల్లీలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. సోనియాగాంధీ అల్లుడి అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇది చూస్తేనే చెప్పవచ్చు - ఇది స్వార్థపు లోకమని! ఆరోపిస్తే విచారణ చేస్తారు. ఆధారాలు లేకపోయినా జైలులో పెడతారు. అన్ని ఆధారాలతో బట్టబయలైనా సోనియాగాంధీ అల్లుడిని ఎందుకు జైల్లో పెట్టలేదు? సోనియాకో న్యాయం, వైయస్ కుటుంబానికి మరో న్యాయం. ఇదెక్కడి నీతిమాలిన రాజకీయం? వైయస్ కుటుంబ సభ్యులపై కక్ష కట్టారు. అందుకోసమే జగన్‌ను విచారణ పేరుతో జైల్లో పెట్టారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్‌ను ఎంతకాలం జైలులో పెట్టినా ప్రజాదరణ పెరుగుతుందే తప్ప తరగదు. రాబోయే కాలానికి కాబోయే సీఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రమే!

- నందు, గోదావరిఖని, కరీంనగర్ జిల్లా.

ప్రజాకోర్టులో జగన్‌కు తప్పకుండా న్యాయం జరుగుతుంది

ధర్మయుద్ధం అంటే యుద్ధం చేసే వ్యక్తులు ఆయుధాలు కలిగి ఉండి యుద్ధం చేయాలి కానీ జగన్ విషయంలో కుట్రలతో కూడిన యుద్ధం జరుగుతోంది. జగన్ మీద ఇప్పుడు ఏ ఆరోపణల మీద అయితే సీబీఐ విచారణ జరుపుతోందో అవే ఆరోపణలు 2009కి ముందు కూడా టీడీపీ చేసింది. కానీ అప్పుడు జగన్ మీద ఎలాంటి విచారణ జరగలేదు. నిజంగా జగన్ మీద కోర్టులో కేసు ఆరోజే (2009కి ముందు వైయస్సార్ బతికున్నప్పుడు) వేసి ఉంటే ఇప్పడు ఈ కేసు వేసిన వ్యక్తుల మీద కొంచెమైనా గౌరవం ఉండేది కానీ అలా జరగలేదు. వైయస్సార్ చనిపోయిన తర్వాత, జగన్ కాంగ్రెస్‌ని వీడిన తర్వాత జగన్‌కి ప్రజల ఆదరణ పెరుగుతోంది అని తెలిసి, కుట్రలతో ప్రత్యర్థులు (కాంగ్రెస్+టీడీపీ) అయినా కూడా జగన్ మీద కలిసి కేసులు వేశారు.

నిజంగా వైయస్సార్ బతికున్నప్పుడు ఈ కేసులు వేసి ఉంటే అప్పుడు యుద్ధం ధర్మంగా జరిగేది. ఈ కేసులు పెట్టిన వ్యక్తుల మీద ప్రజలలో కూడా ఒక నమ్మకం ఉండేది. జగన్‌ని ఒంటరిని చేశామని టీడీపీ, కాంగ్రెస్ వాళ్ళు ఆనందపడుతూ ఉండవచ్చు కానీ ప్రజలు తమకు అవకాశం ఎప్పుడు వస్తుందా, ఈ కుట్రలకు సమాధానం ఎప్పుడు చెబుదామా అని ఎదురుచూస్తున్నారు. ఈ కుట్రలతో జగన్‌ని బంధించవచ్చు కానీ ప్రజాకోర్టులో జగన్‌ను తప్పకుండా న్యాయం జరుగుతుంది.

- జె.ఎన్. జవహర్, విజయవాడ
Share this article :

0 comments: