వైఎస్సార్ సీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల సమావేశంలో నేతల సవాల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల సమావేశంలో నేతల సవాల్

వైఎస్సార్ సీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల సమావేశంలో నేతల సవాల్

Written By news on Friday, July 26, 2013 | 7/26/2013

అరకులోయ, న్యూస్‌లైన్: పంచాయతీ ఎన్నికల ఫలితాలను వైఎస్సార్ సీపీ లేనిది ఉన్నట్లు చూపుతోందని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న చౌకబారు ఆరోపణలకు విశాఖపట్నం జిల్లా అరకులోయ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కుంభా రవిబాబు గట్టి సమాధానం చెప్పారు. తమ పార్టీ తరపున గెలుపొందిన 70 మందికి పైగా సర్పంచ్‌ల్లో 56 మందిని గురువారం ఆయన మీడియా ముందుకు తీసుకొచ్చారు. అరకులోయ మండలం గద్దెగూడ గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు దాడి వీరభద్రరావు, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు సత్తి రామకష్ణారెడ్డి హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలని కుమ్మక్కు రాజకీయాలు నడిపిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు గిరిజనం చెంప దెబ్బ కొట్టారని వారు చెప్పారు. వైఎస్ జగన్‌తోనే ఏజెన్సీ అభివృద్ధి సాధ్యమవుతుందని గిరిజనులు నమ్ముతున్నారని వారు స్పష్టం చేశారు.
Share this article :

0 comments: