Home »
» ‘నా దృష్టిలో వైఎస్సార్’ అంశంపై పోటీలు
‘నా దృష్టిలో వైఎస్సార్’ అంశంపై పోటీలు
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ‘నాదృష్టిలో వైఎస్సార్’ అనే అంశంపై సాక్షి టీవీ ఆధ్వర్యంలో చిన్నారులకు రాష్ట్ర స్థాయి వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీకి ఐదు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 5, 6, 7 తరగతుల విద్యార్థులు ఒక కేటగిరీ, 8, 9, 10 తరగతుల విద్యార్థులు మరో కేటగిరీగా పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పోటీల్లో పాల్గొన దలచిన వారు టోల్ఫ్రీ నంబరు 18004259899కు ఫోన్ చేసి వివరాలను నమోదు చేసుకోవచ్చు.పాటల పోటీ కూడా: మహానేత వైఎస్సార్ పాలనను కొనియాడుతూ తమ అభిమానాన్ని చాటుకునే వారి కోసం ‘రాజన్న పాట’ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్కు తమ పాటలను నివాళిగా సమర్పించాలనుకునే వారు ఒక నిమిషం నిడివి దాటకుండా ఎంపీ-3 విధానంలో పాటను సిద్ధం చేసి rajannapata@sakshi.comకు ఈ మెయిల్కు తమ ఎంట్రీలను జూలై 6 నాటికి పంపాలి. అన్ని పోటీల్లోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులతో పాటు సాక్షి స్టూడియోలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
0 comments:
Post a Comment