- ప్రజాకోర్టులో జగన్ ముమ్మాటికీ నిర్దోషే
- కృష్ణా జిల్లా జగయ్యపేటలో సాక్షి చైతన్యపథంలో వక్తలు
సాక్షి, జగ్గయ్యపేట: ‘‘సీబీఐ ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేస్తోంది. జగన్ బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చినప్పుడలా ముందురోజు ఏదో ఒకరకమైన హడావుడి చేసి తీర్పును పరోక్షంగా ప్రభావితం చేయ టం వారి నైజంగా కనిపిస్తోంది. జగన్పై ఇంకెన్నాళ్లు ఈ కుట్రలు సాగిస్తారు’’ అని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటవాసులు ప్రశ్నించారు. ‘సాక్షి’ చైతన్యపథం శుక్రవారం జగ్గయ్యపేటలో జరిగింది. న్యాయవాదులు, విద్యావేత్తలు, మేధావులు పాల్గొన్న ఈ సదస్సుకు నాగరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ పార్టీ ప్రారంభించాకే వేధింపులు అధికమయ్యాయని తెలిపారు. విచారణకు పిలిచి జగన్ను రాత్రికి రాత్రే అరెస్ట్ చేయటం వెనుక కాంగ్రెస్కు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శిం చారు. ఉపాధ్యాయ సమాఖ్య నేత ఎం. సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి కేజీ బేసిన్లో అక్రమా లు, ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు పలు సంస్ధలకు భూములు కట్టబెట్టడం, వోక్స్ వ్యాగ న్ కుంభకోణం ఇలా అనేకం ఉన్నా ఎందుకు వీటిని సుమోటోగా తీసుకోలేదని ప్రశ్నించారు.
విశ్రాంత ప్రభుత్వ సాంకేతిక అధికారి షేక్జిలానీ మాట్లాడుతూ సీబీఐ వింతపోకడలు అవలంబిస్తోం దన్నారు. జియాలజిస్ట్ ధరణికోట వెంకటరమణ మాట్లాడుతూ మొదట రూ.లక్ష కోట్లు, ఆ తర్వాత రూ.48వేల కోట్లు అవినీతి జరిగిందని, ఇప్పుడు రూ.30 కోట్లు అంటోందని, దీనిబట్టే తెలుస్తోంది దర్యాప్తులో ఎంత డొల్లతనం ఉందో అని మండిపడ్డారు. బీసీ యువజన సంఘ ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ గతంలో ఏ కేసులో వ్యవహరించని రీతిలో సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్ విజ యమ్మ చంద్రబాబుపై రెండువేల పేజీలతో కోర్టుకు ఫిర్యాదు చేస్తేఎందుకు కొట్టివేశారో అర్థం కాని ప్రశ్న గా మిగిలిపోయిందన్నారు. విశ్వభారతి కళాశాల కరస్పాండెంట్ కె.పద్మశేఖర్ మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో సీబీఐ కుట్ర సాగిస్తుందని ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
- కృష్ణా జిల్లా జగయ్యపేటలో సాక్షి చైతన్యపథంలో వక్తలు
సాక్షి, జగ్గయ్యపేట: ‘‘సీబీఐ ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేస్తోంది. జగన్ బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చినప్పుడలా ముందురోజు ఏదో ఒకరకమైన హడావుడి చేసి తీర్పును పరోక్షంగా ప్రభావితం చేయ టం వారి నైజంగా కనిపిస్తోంది. జగన్పై ఇంకెన్నాళ్లు ఈ కుట్రలు సాగిస్తారు’’ అని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటవాసులు ప్రశ్నించారు. ‘సాక్షి’ చైతన్యపథం శుక్రవారం జగ్గయ్యపేటలో జరిగింది. న్యాయవాదులు, విద్యావేత్తలు, మేధావులు పాల్గొన్న ఈ సదస్సుకు నాగరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ పార్టీ ప్రారంభించాకే వేధింపులు అధికమయ్యాయని తెలిపారు. విచారణకు పిలిచి జగన్ను రాత్రికి రాత్రే అరెస్ట్ చేయటం వెనుక కాంగ్రెస్కు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శిం చారు. ఉపాధ్యాయ సమాఖ్య నేత ఎం. సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి కేజీ బేసిన్లో అక్రమా లు, ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు పలు సంస్ధలకు భూములు కట్టబెట్టడం, వోక్స్ వ్యాగ న్ కుంభకోణం ఇలా అనేకం ఉన్నా ఎందుకు వీటిని సుమోటోగా తీసుకోలేదని ప్రశ్నించారు.
విశ్రాంత ప్రభుత్వ సాంకేతిక అధికారి షేక్జిలానీ మాట్లాడుతూ సీబీఐ వింతపోకడలు అవలంబిస్తోం దన్నారు. జియాలజిస్ట్ ధరణికోట వెంకటరమణ మాట్లాడుతూ మొదట రూ.లక్ష కోట్లు, ఆ తర్వాత రూ.48వేల కోట్లు అవినీతి జరిగిందని, ఇప్పుడు రూ.30 కోట్లు అంటోందని, దీనిబట్టే తెలుస్తోంది దర్యాప్తులో ఎంత డొల్లతనం ఉందో అని మండిపడ్డారు. బీసీ యువజన సంఘ ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ గతంలో ఏ కేసులో వ్యవహరించని రీతిలో సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్ విజ యమ్మ చంద్రబాబుపై రెండువేల పేజీలతో కోర్టుకు ఫిర్యాదు చేస్తేఎందుకు కొట్టివేశారో అర్థం కాని ప్రశ్న గా మిగిలిపోయిందన్నారు. విశ్వభారతి కళాశాల కరస్పాండెంట్ కె.పద్మశేఖర్ మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో సీబీఐ కుట్ర సాగిస్తుందని ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
0 comments:
Post a Comment