వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 226వ రోజు (జిల్లాలో 11వ రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు మంగళవారం ప్రకటించారు. బుధవారం ఉదయం పట్టుపురానికి సమీపంలోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర.. జాడుపల్లి మీదుగా సాగుతుంది. భోజన విరామం తర్వాత షర్మిల.. తూముకొండ, పెద్దమడి, హీ రాపురం, చీపురుపల్లి, రేగులపాడు, టెక్కలిపట్నం, మోదుగులపుట్టి గ్రామాల మీదుగా వీరభద్రపురం చేరుకుంటారు. అనంతరం అక్కడ రాత్రి బస చేస్తారు.
జిల్లాలో 11వ రోజు పర్యటించే ప్రాంతాలు
జాడుపల్లి, తూముకొండ, పెద్దమడి, హీరాపురం, చీపురుపల్లి, రేగులపాడు, టెక్కలిపట్నం,
మోదుగులపుట్టి, వీరభద్రపురం
0 comments:
Post a Comment