విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చిట్టెంపాడు, మూలపేటల నుంచి వైఎస్సార్ సీపీ మద్దతు సర్పంచ్లుగా పాడి ధారబాబు, పోలోజు సాయికిరణ్ ఎన్నికయ్యారు. వీరిద్దరినీ తమ పార్టీలో చేర్చుకునే యత్నంలో మంత్రి బాలరాజు గురువారం నర్సీపట్నంలోని తన నివాసానికి పిలిపించుకున్నారు. వారికి బలవంతంగా పార్టీ కండువా కప్పి విలేకరుల ముందుంచారు. మంత్రి తీరును తప్పుబడుతూ, శుక్రవారం ధారబాబు విలేకరులతో మాట్లాడారు. బాలరాజు తనను పిలిచి బలవంతంగా కాంగ్రెస్ కండువా వేశారని, మంత్రి కావడంతో తాను ఎదురు చెప్పలేకపోయానన్నారు. వైఎస్సార్సీపీ అండతోనే తాను సర్పంచ్గా ఎన్నికయ్యానని స్పష్టం చేశారు.
Home »
» బాలరాజు బెదిరించారు
బాలరాజు బెదిరించారు
Written By news on Saturday, July 27, 2013 | 7/27/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment