స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపేలా కార్యకర్తలను సంసిద్ధుల్ని చేయడంలో భాగంగా ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్కు వెళ్లనున్నారు. ముందుగా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో ఏర్పాటు చేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
అక్కడి నుంచి హన్మకొండ హంటర్ రోడ్డులోని అభిరామ్ గార్డెన్లో జరిగే పార్టీ జిల్లా స్థాయి పంచాయతీరాజ్ సదస్సులో పాల్గొననున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం డోర్నకల్ నియోజకవర్గం మరిపెడలో జరిగే బహిరంగసభకు హాజరుకానున్నారు. విజయమ్మ రాక సందర్భంగా ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం అవుతున్నారు.
అక్కడి నుంచి హన్మకొండ హంటర్ రోడ్డులోని అభిరామ్ గార్డెన్లో జరిగే పార్టీ జిల్లా స్థాయి పంచాయతీరాజ్ సదస్సులో పాల్గొననున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం డోర్నకల్ నియోజకవర్గం మరిపెడలో జరిగే బహిరంగసభకు హాజరుకానున్నారు. విజయమ్మ రాక సందర్భంగా ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం అవుతున్నారు.
0 comments:
Post a Comment