వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకోవడం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘట్టమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రశంసించారు. ఆయన తిరుపతిలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. నాడు చంద్రబాబు రాక్షస పాలనకు వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టారని, నేడు బాబు పాలనను మించి పోతున్న కాంగ్రెస్ పాలనకు నిరసనగా షర్మిల యాత్ర చేపట్టారన్నారు. షర్మిల మూడు వేలకుపైగా కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అభినందించదగ్గ విషయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి కొనియాడారు. సోమవారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో తెలుసుకుంటున్న విషయాలను షర్మిల ఎప్పటికప్పుడు లేఖ ద్వారా జగన్మోహన్రెడ్డికి తెలియజేస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి జైలు నుంచి విడుదల కాగానే సంబంధిత సమస్యల పరిష్కారం దిశగా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.
Home »
» ‘ప్రపంచ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం’
‘ప్రపంచ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం’
Written By news on Tuesday, July 30, 2013 | 7/30/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment