తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలని ఆహ్వానించారు. వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో మమత ఫోన్ లో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి వారు చర్చలు జరిపారు. వారు దాదాపు 15 నిమిషాలు చర్చించుకున్నారు.
నవంబర్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని మమత భావిస్తున్నారు. కాంగ్రెస్-బిజెపికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. తమతో కలిసిరావాలని, ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలని ఆమె విజయమ్మను ఆహ్వానించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డితో మాట్లాడి చెబుతానని విజయమ్మ మమతా బెనర్జీకి చెప్పారు.
నవంబర్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని మమత భావిస్తున్నారు. కాంగ్రెస్-బిజెపికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. తమతో కలిసిరావాలని, ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలని ఆమె విజయమ్మను ఆహ్వానించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డితో మాట్లాడి చెబుతానని విజయమ్మ మమతా బెనర్జీకి చెప్పారు.
0 comments:
Post a Comment