‘నా దృష్టిలో వైఎస్సార్’పై చిత్రలేఖన పోటీలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘నా దృష్టిలో వైఎస్సార్’పై చిత్రలేఖన పోటీలు

‘నా దృష్టిలో వైఎస్సార్’పై చిత్రలేఖన పోటీలు

Written By news on Thursday, July 4, 2013 | 7/04/2013

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ‘నాదృష్టిలో వైఎస్సార్’ అనే అంశంపై సాక్షి టీవీ ఆధ్వర్యంలో చిన్నారులకు రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఐదు నుంచి పదో తరగతి విద్యార్థులు మాత్రమే పోటీ కి అర్హులని పేర్కొన్నారు. 5, 6, 7 తరగతుల విద్యార్థులు ఒక కేటగిరీ, 8, 9, 10 తరగతుల విద్యార్థులు మరో కేటగిరీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. పోటీల్లో పాల్గొన దలిచిన వారు టోల్‌ఫ్రీ నంబరు 18004259899కు ఫోన్ చేసి వివరాలను నమోదు చేసుకోవచ్చు. 

పాటల పోటీ కూడా..

మహానేత వైఎస్సార్ పాలనను కొనియాడుతూ తమ అభిమానాన్ని చాటుకునే వారి కోసం ‘రాజన్న పాట’ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌కు తమ పాటలను నివాళిగా సమర్పించాలనుకునే వారు ఒక నిమిషం నిడివి దాటకుండా ఎంపీ-3 విధానంలో పాటను సిద్ధం చేసి rajannapata@sakshi.com కు ఈ మెయిల్ ద్వారా పంపాలి. ఎంట్రీలను జూలై 6 నాటికి పంపాలి. హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయం (బంజారాహిల్స్)లో కూడా పాటలను ఎంట్రీలుగా సీడీ రూపంలో అందించవచ్చు. అన్ని పోటీల్లోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులతో పాటు సాక్షి స్టూడియోలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. 
Share this article :

0 comments: