నర్సిపురం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నర్సిపురం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

నర్సిపురం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

Written By news on Saturday, July 20, 2013 | 7/20/2013

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర శనివారం నర్సిపురం నుంచి ప్రారంభమైంది. అనంతరం యర్రా కృష్ణమూర్తి కాలనీ మీదగా పార్వతీపురం చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. అనంతరం కొత్తవలస, ఉల్లిభద్ర జంక్షన్,సుంకి గ్రామాల మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ఆమె చేపట్టిన పాదయాత్ర శనివారం 215వ రోజుకు చేరుకుంది.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 215వ రోజు(జిల్లాలో పదమూడవ రోజు) సాగే వివరాలను పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు శుక్రవారం ప్రకటించారు. శనివారం ఉదయం యర్రా కృష్ణమూర్తి కాలనీ, పార్వతీపురంలలో పాదయాత్ర చేసిన తరువాత పార్వతీపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కొత్తవలసలో పాదయాత్ర చేసి మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. విరామం తరువాత ఉల్లిభద్ర జంక్షన్, సుంకి గ్రామా ల్లో పాదయాత్ర చేసి రాత్రి బస చేస్తారు. 

జిల్లాలో పదమూడవ రోజు పర్యటించే ప్రాంతాలు
యర్రా కృష్ణమూర్తి కాలనీ, పార్వతీపురం, కొత్తవలస, ఉల్లిభద్ర జంక్షన్, సుంకి.
Share this article :

0 comments: