జనం హృదయంలో ఉన్న జగనన్నను నిర్బంధించడం ఎవరి తరమూ కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనం హృదయంలో ఉన్న జగనన్నను నిర్బంధించడం ఎవరి తరమూ కాదు

జనం హృదయంలో ఉన్న జగనన్నను నిర్బంధించడం ఎవరి తరమూ కాదు

Written By news on Wednesday, July 31, 2013 | 7/31/2013

జనం హృదయంలో ఉన్న జగనన్నను నిర్బంధించడం ఎవరి తరమూ కాదు
 జగన్ కోసం - 430 రోజులు
 జనాల హృదయాలలో బందీ అయిన జగనన్నను ఎవరైనా ఎలా నిర్బంధించగలరు?! జగనన్నను కస్టడీలో ఉంచారు. కాపలా పెట్టారు. గడువులు పొడిగిస్తూ, కడగండ్లపాలు చేశామని సంబరపడిపోతున్నారు. కానీ కోట్ల హృదయ బంధువైన, ఆ హృదయాలలో బందీ అయిన జగనన్నకు ఏది కస్టడీ? ఎవరు కాపలా? నీటిని గుప్పెట నిలబెట్టినప్పుడు, నిప్పును గుడ్డతో ముడిపెట్టినప్పుడు, సుడిగాలిని బంధించినప్పుడు, ప్రసరించే విద్యుత్తును పట్టుకున్నప్పుడు... అప్పుడు మాత్రమే జగనన్నను నిజంగా నిర్బంధించగలరు.
 - మార్తాటి ఈశ్వరీగోపాలరావు, శింగరాయకొండ, ప్రకాశం జిల్లా
 
 ఉప్పూనిప్పులా ఉండేవాళ్లు... జగన్‌పై కక్షతో పాలూనీళ్లయ్యారు!
 జగన్ అన్న పేరే పేదవారికొక భరోసా. నిరుపేద కుటుంబాలకు పెద్ద అండ. ఉన్నతమైన రాజకీయ భవిష్యత్తును పేదప్రజల కోసం త్యాగం చేసిన నాయకుడు జగన్. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. జగన్‌ని రాజకీయంగా ఎదగనివ్వకుండా చేసేందుకు ప్రజాసంక్షేమం కోసం ఉప్పు-నిప్పులా ఉండవలసిన పాలక, ప్రతిపక్షాలు తమ స్వార్థ రాజకీయాల కోసం పాలూ నీళ్లలా కలిసిపోయాయి. జగన్‌ను జైల్లో ఉంచి, బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాయి. దాదాపు ఏడాదికి పైగా రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు జగన్ రాక కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం, సీబీఐల కుటిల వ్యూహాలు ఫలించి జగన్ విడుదల వాయిదా పడుతోంది. ఒక వ్యక్తిపై పగబట్టి, ఆ వ్యక్తి చుట్టూ ఉచ్చు బిగించడానికే యావత్ యంత్రాంగాన్ని వాడుకుంటున్న పాలకపక్షం ప్రజాసమస్యలను పూర్తిగా విస్మరించడం ప్రజలకు విస్మయాన్ని కలిగిస్తోంది.
 
 వై.ఎస్.ఆర్.గారు ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను సమర్థంగా అమలుపరచి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. రేపు జగన్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే ప్రజల్లో ఒకరిగా కలిసిపోయి, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను మరిపిస్తారన్న భయంతోనే ఆయన్ని ఇంతగా వేధిస్తున్నారు. ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కుట్రలు ఎల్లకాలం ఫలించవు. జగనన్న పడుతున్న ఇబ్బందులు తాత్కాలికమే. రాబోయే రోజుల్లో ఆయన దేశ రాజకీయాలను సైతం శాసించే విధంగా ఎదుగుతారు. యువతరానికి ఆదర్శనాయకుడు అవుతారు. జగన్ మాత్రమే ప్రజలకు మేలు చేయగలరు. అంతటి శక్తి, మంచితనం ఆయనొక్కరికే ఉంది.
 - ఆర్. యేసుకుమార్, హైదరాబాద్
 
 మా చిరునామా:
 జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1,
 బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
 e-mail: ysjagankosam@ gmail.com
Share this article :

0 comments: