వైఎస్ఆర్ కు కుటుంబ సభ్యుల నివాళులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కు కుటుంబ సభ్యుల నివాళులు

వైఎస్ఆర్ కు కుటుంబ సభ్యుల నివాళులు

Written By news on Monday, July 8, 2013 | 7/08/2013

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని సమాధిస్థలి దగ్గర అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఈ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి, వైఎస్‌ కొండారెడ్డి తదితరులు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టింది. 

ఉదయం 8.30 గంటలకు హెడ్ పోస్టాఫీసు వద్ద వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం, పుష్పాలంకరణ. అనంతరం కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌బీ అంజాద్‌బాష ఆధ్వర్యంలో అన్నదానం. 9 గంటలకు వైఎస్సార్ విగ్రహం వద్ద సేవాదళం విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

9.30 గంటలకు మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో అల్‌షిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ.
10 గంటలకు ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో పద్మ మానసిక పునరావాస కేంద్రంలో దుప్పట్ల పంపిణీ.
10.30 గంటలకు నగర మహిళా విభాగం ఆధ్వర్యంలో రాస్ స్వచ్ఛంధ సంస్థలో పండ్లు పంపిణీ.
10.45 గంటలకు శంకరాపురంలోని అంధుల పాఠశాలలో వైఎస్సార్ సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ
11.00 గంటలకు అమ్మ ఒడిలో జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ
11.30 గంటలకు రిమ్స్‌లో వైఎస్సార్ టీయూసీ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ.
11.45 గంటలకు సాయిబాబా అనాథ శరణాలయంలో ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో అన్నదానం.
12.15 గంటలకు ఆర్తీహోంలో నగర యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.
12.30 గంటలకు అంధుల పాఠశాలలో రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
Share this article :

0 comments: