వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎల్లో కూటమి చేస్తున్న ఆరోపణలను ఆపార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఎల్లో కూటమికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మారటం లేదని అన్నారు. శోభా నాగిరెడ్డి బుధవారం ఆళ్లగడ్డలో మీడియాతో మాట్లాడుతూ ఎక్కడో జరిగిన సంఘటనకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధం ఏంటని ప్రశ్నించారు.
పార్టీకి సంబంధం లేని విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా అంటగడతారని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. కోలా కృష్ణమోహన్ కు చంద్రబాబుకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. కుట్రలో భాగంగానే ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఎంతోమందిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని శోభా నాగిరెడ్డి గుర్తు చేశారు.
పార్టీకి సంబంధం లేని విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా అంటగడతారని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. కోలా కృష్ణమోహన్ కు చంద్రబాబుకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. కుట్రలో భాగంగానే ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఎంతోమందిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని శోభా నాగిరెడ్డి గుర్తు చేశారు.
0 comments:
Post a Comment