తొలి విడతలో మేమే నెంబర్‌వన్‌:: :::; మైసూరారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తొలి విడతలో మేమే నెంబర్‌వన్‌:: :::; మైసూరారెడ్డి

తొలి విడతలో మేమే నెంబర్‌వన్‌:: :::; మైసూరారెడ్డి

Written By news on Wednesday, July 24, 2013 | 7/24/2013

మొదటిదశ పంచాయతీ ఎన్నికల్లో తామే నెంబర్‌వన్‌ అని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి అన్నారు. ప్రాంతాలవారీగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో వివరాలతో లిస్టు విడుదల విడుదల చేశారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్.. 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీతో దీటుగా రెండేళ్ల వయస్సున్న వైఎస్ఆర్ సీపీ ఫలితాలు సాధించడం మామూలు విషయం కాదన్నారు. మిగిలిన పార్టీలు గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తే తాము కూడా అందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. లిస్టుతో రెడీగా ఉన్నామని చెప్పారు.

పార్టీ గుర్తుపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో ఎలక్షన్ కమిషన్‌ తేలుస్తుందని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత.. ప్రజల పక్షాన ఉన్న పార్టీని నిలదీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అవనిగడ్డ ఉపఎన్నికపై అంబటి బ్రాహ్మణయ్య కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తే తమ పార్టీ అధ్యక్షుడితో చర్చించి పోటీ చేయలా, వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని మైసూరారెడ్డి చెప్పారు.

ఆయా పార్టీల విప్‌లు ధిక్కరించిన ఎమ్మెల్యేలపై అప్పుడే అనర్హత వేటు వేసి ఉంటే ఉప ఎన్నికలు కూడా జరిగి ఉండేవన్నారు. ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి సత్తా ఏమిటో తెలిసి ఉండేదన్నారు. పార్టీ రహిత ఎన్నికలు నిర్వహిస్తారు... అవి అయ్యాక సవాళ్ళు విసురుతుంటారని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థలను తాను బలోపేతం చేస్తే మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ నిర్వీర్యం చేశారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మైసూరారెడ్డి మండిపడ్డారు.

రాజ్యాంగం 9వ షెడ్యూల్లో ఉన్న అంశాల్లో పదింటిని జిఓలిచ్చి 2002, 07, 08 సంవత్సరాల్లో అని మైసూరారెడ్డి తెలిపారు. అవన్నీ స్థానిక సంస్థలకు దఖలు పరుస్తూ విడుదల చేసినవే అన్నారు. అన్నీ అమలు జరుగుతున్నాయా లేదా అని ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించాల్సింది పోయి మరణించిన వైయస్ఆర్‌పై ఆరోపణలు చేయడం తగదని తిప్పికొట్టారు. స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించకుండా, అధికారుల ద్వారా పరిపాలన సాగిస్తున్నది ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించినది అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన, విమర్శించాల్సిన హక్కు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబుకు ఉందన్నారు. కానీ, అధికారంలో ఉన్నవారిని కాకుండా ఇతరులను విమర్శించడం హేతుబద్ధం కాదని, అర్థరహితం కూడా అన్నారు. జన్మభూమి అని నోడల్‌ వ్యవస్థను పెట్టి మండలాధ్యక్షులు, పంచాయతీ సర్పంచ్‌లను నిర్వీర్యం చేసింది, ఉత్సవ విగ్రహాలను చేసింది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాదా ఆత్మపరిశీలన చేసుకోవాలని మైసూరా అన్నారు.

అంతకన్నా ఘోరమైన విషయం ఏమిటంటే విద్యా కమిటీలు, వన సంరక్షణ సమితులు, నీటి సంఘాలు అంటూ చంద్రబాబు వివిధ రకాల కమిటీలు వేసి నిధులు బదలాయించిన వైనాన్ని మైసూరారెడ్డి గుర్తుచేశారు. ఆ నిధులను రాజ్యాంగేతర శక్తులకు బదలాయించినట్లే అవుతుందని ఆయన ఆరోపించారు. 73, 73 రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నికైన సర్పంచ్‌లు, మండలాధ్యక్షులు ఉండగా .. వారిని కాదని దొడ్డిదారిలో నియమించి అలాంటి రాజ్యాంగేతర శక్తులకు హక్కులు బదలాయించడం చంద్రబాబు కాదా అన్నారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి ఫైనాన్సు కమిషన్‌ సిఫార్సు చేసిన నిధులను చంద్రబాబు ఎప్పుడూ విడుదల చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలను ఇలా నిర్వీర్యం చేసిన చంద్రబాబు ఇప్పుడు వాటిని బలోపేతం చేస్తామనడం అర్థరహితం అని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చంద్రబాబు చెబుతున్న కబుర్లే అవి అన్నారు. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి మొట్టమొదట నీరుగార్చేది స్థానిక సంస్థలనే అన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డే నెంబర్‌ 1 అని సిఎన్ఎన్ - ఐబిఎన్‌ సర్వే చెప్పిందని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు మైసూరారెడ్డి సమాధానం చెప్పారు.
Share this article :

0 comments: