నరం లేని నాలుక ఎలాగైనా తిరుగుతుంది అని సామెత. ఈ సామెత కాంగ్రెస్ నాయకులకు బాగా సరిపోతుంది. మనిషి ఉన్నపుడు ఒకరకంగా, లేనప్పుడు మరో రకంగా మాట్లాడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి వాళ్లు తమ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచిస్తే అర్థమౌతుంది. ఇదే దానం నాగేందర్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి, మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారు ఆయనను చేరదీశారు. దానం ఆ సంగతి మరిచి వై.ఎస్.గారికి, జగన్గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దానం లాంటి నరం లేని నాలుకలు కాంగ్రెస్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. వారంతా కలిసి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా, ఎన్ని ఆరోపణలు చేసినా జగన్పై ఉన్న ప్రజాభిమానాన్ని ఏమాత్రం తగ్గించలేరు. జగన్ బయటికి వచ్చాక ప్రజలే ఈ కాంగ్రెస్ నాయకుల ఆటలు కట్టిస్తారు. తెలుగుదేశంలోని స్వామిభక్త నోటి దురద నాయకుల నాలుకలు కత్తిరిస్తారు. ఇప్పటికైనా వీరు తమ తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. లేదంటే ప్రజలే తగిన శాస్తి చేస్తారు.
- ఎస్.విశ్వనాథం, హైదరాబాద్ జగన్ నిర్బంధం... ప్రజాభీష్టానికి విరుద్ధం ఈ రాష్ట్రాన్ని రాజశేఖరరెడ్డిగారు అన్నివిధాలా అభివృద్ధి పథంలో నడిపించారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో ప్రజానీకానికి ప్రత్యక్షంగా తన సంక్షేమ పథకాల ద్వారా చూపించారు. ప్రజల్లో మమేకమై, ప్రజల కష్టాలను తెలుసుకుని అన్నితరగతుల వారికి మేలు జరిగే విధంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. రాజు మంచివాడు, సమర్థుడు అయితే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అదేవిధంగా రాజన్న పాలనలో రాష్ట్రం సుఖసంతోషాలతో వర్థిల్లింది. కనీసం ఇంటికొక వ్యక్తి అయినా వై.ఎస్.గారి పథకాల వల్ల లాభపడి వుంటారు. అలాంటి నాయకుడి కుమారుడైన జగన్ని కాంగ్రెస్, టీడీపీ నాయకులు విమర్శించడాన్ని, ఆయనపై దుష్ర్పచారం చేయడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా అంతాకలసి జగన్ని, ఆయన కుటుంబ సభ్యులను వేధిస్తున్న నాయకులందరికీ త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు. - నాగేశ్వరరెడ్డి, అడ్వొకేట్, ఇ-మెయిల్ భార్యబిడ్డలకు దూరం చేసినంతమాత్రాన ప్రజల గుండెల నుంచి వేరు చేయగలరా? జనహృదయనేత, మన రాజన్న కుమారుడు జగనన్నని కేవలం మాట మీద నిలబడినందుకు సీబీఐ చేత అక్రమంగా అరెస్టు చేయించింది కాంగ్రెస్ అధిష్టానం. భార్యబిడ్డలకు దూరం చేశారు కానీ, కోట్లాదిమంది ప్రజల గుండెల నుండి జగనన్నని వేరుచేయగలరా? చేయలేమన్న సంగతి ఈసరికే కాంగ్రెస్కు స్పష్టమై ఉండాలి. జగనన్న నిర్దోషి అని ప్రజలంతా నమ్ముతున్నారు. ఆయనపై ఆరోపణలు చేసిన సీబీఐ కూడా ఇంతవరకు సాక్ష్యాధారాలను చూపలేకపోయింది. కాంగ్రెస్ నాయకులకు కూడా జగన్ నిర్దోషి అని తెలుసు కానీ, అధిష్టానం దోషి అంటుంటే తల ఊపకుండా ఉంటారా? తల తోక లేని విమర్శలు చేయకుండా ఉంటారా? వారికి ప్రజాదరణ కన్నా సోనియా ఆదరణే ముఖ్యం. అందుకే భవిష్యత్తు పరిణామాలను ఊహించకుండా తమ అధిష్టానం జగనన్న విషయంలో తానా అంటే తందానా అంటున్నారు. జగనన్న జనం గుండె చప్పుడని కాంగ్రెస్ పెద్దలకు తెలిసినప్పటి నుంచి వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. రాజన్న ఆశయాలను నెరవేర్చే నాయకుడిగా జగన్ ఎదుగుతున్నకొద్దీ వాళ్లలో నిరాశ నిస్పృహలు అలముకుంటున్నారు. అందుకే కక్ష కట్టి అరెస్ట్ చేయించారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలు ఎల్లకాలం సాగవు. జగనన్న త్వరలోనే బయటికి వస్తారు. అప్పుడు చూడాలి వీరి పాట్లు, పరుగులు. - నెల్లూరు పావని, జలదంకి, నెల్లూరుజిల్లా మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com |
Home »
» ఎవరెన్ని ఆరోపణలు చేసినా...జగన్కున్న ప్రజాదరణ తగ్గదు
ఎవరెన్ని ఆరోపణలు చేసినా...జగన్కున్న ప్రజాదరణ తగ్గదు
Written By news on Thursday, July 25, 2013 | 7/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment