మీ ఓటే బ్రహ్మాస్త్రం : వైఎస్ విజయమ్మ దిశానిర్దేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ ఓటే బ్రహ్మాస్త్రం : వైఎస్ విజయమ్మ దిశానిర్దేశం

మీ ఓటే బ్రహ్మాస్త్రం : వైఎస్ విజయమ్మ దిశానిర్దేశం

Written By news on Tuesday, July 2, 2013 | 7/02/2013

- పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుదాం 
- జగన్ నిర్దోషిత్వాన్ని నిరూపిద్దాం
- ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశంలో విజయమ్మ దిశానిర్దేశం

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ‘వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓటే బ్రహ్మాస్త్రం .. అలాగే మీరు వేయించే ఓట్లు కూడా జగన్‌ను బయటకు తీసుకొస్తాయి.. జగన్ నిర్దోషని నిరూపిస్తుంది.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటాల’ని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని నిమ్మల విఠల్‌రెడ్డి ఫంక్షన్‌హాలులో సోమవారం జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు.

హైదరాబాద్ నుంచి ఇచ్చోడకు వస్తున్న విజయమ్మకు నిర్మల్,నేరడిగొండ, ఇచ్చోడలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎంపీ, పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశంలో తొలుత మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. తర్వాత ఉత్తరాఖండ్ మృతులు, తెలంగాణ కోసం, వైఎస్ మరణాంతరం మృతి చెందిన వారి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ, ‘ఈ రాష్ర్టంలో చీకటిపాలన సాగుతోంది. 

అధికారపక్షం ప్రజలపై రాయితీలు తగ్గించి పన్నులు, చార్జీల భారం మోపుతుంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతి పక్షం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది.’ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీల దిగజారుడు రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ప్రజల ఆదరాభిమానాల వల్ల రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకే అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పార్టీ శ్రేణులు గట్టిగా కృషి చేసి ప్రతి గ్రామ పంచాయతీపై వైఎస్సార్సీపీ జెండా ఎగిరేలా పాటు పడాలని వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అడ్డదారులు తొక్కే అవకాశం ఉంది.. జాగ్రత్త
సహకార సంఘాల ఎన్నిల్లాగే వచ్చే పంచాయతీ ఎన్నికల్లోను అధికార కాంగ్రెస్ అడ్డదారులు తొక్కే అవకాశం ఉందని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని విజయమ్మ కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని దెబ్బతీసేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు చేస్తున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో కేంద్ర పాలక మండలి సభ్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్, మంచిర్యాల సమన్వయ కర్త బి.జనక్‌ప్రసాద్, సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా కో-కన్వీనర్ ఎన్.రవిప్రసాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు నల్లా సూర్యప్రకాశ్, సికింద్రాబాద్ లోక్‌సభ పరిశీలకురాలు పి.విజయరెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: