తెలంగాణపై కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు నిరసిస్తూనే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలిపారు. కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించకుండా ఇరుప్రాంతాల ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మంత్రులు రాజీనామాలకు సిద్ధమవుతుంటే.. అది వారి వ్యక్తిగతమంటున్న బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల రాజీనామాలపై మాత్రం విమర్శలు చేయడాన్ని గట్టు తప్పుబట్టారు.
ఇప్పటివరకు కాంగ్రెస్ తెలంగాణ అంశంపై తన వైఖరి ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. తన వైఖరి వెల్లడించకుండా ఇతర పార్టీల అభిప్రాయం అడిగే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. సీడబ్ల్యూసీలో చర్చిస్తే తెలంగాణ వస్తుందా అని నిలదీశారు. తెలంగాణపై సాగదీతకే కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. ఉరవకొండలో దాడికి పాల్పడ్డ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని గట్టు డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు కాంగ్రెస్ తెలంగాణ అంశంపై తన వైఖరి ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. తన వైఖరి వెల్లడించకుండా ఇతర పార్టీల అభిప్రాయం అడిగే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. సీడబ్ల్యూసీలో చర్చిస్తే తెలంగాణ వస్తుందా అని నిలదీశారు. తెలంగాణపై సాగదీతకే కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. ఉరవకొండలో దాడికి పాల్పడ్డ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని గట్టు డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment