కిరణ్ ఏలుబడిలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం నామమాత్రంగా తయారయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. లక్షలాది మంది పేదలకు లబ్ది చేకూర్చే ఈ పథకాన్ని అర్థంలేని ఆంక్షలతో కాంగ్రెస్ సర్కారు గందరగోళంలో పడేసిందని ఆమె అన్నారు. ఇందిరా పార్క్ వద్ద 48 గంటల పాటు చేపట్టిన ఫీజు పోరు దీక్షను ఆమె ముగించారు. ఆ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.
పాలకుల మొద్దు కారణంగా విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేయాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మంజూరులో మాత్రం చేతివాటం చూపుతోందని విజయమ్మ ఆరోపించారు. ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీలకు కౌన్సెలింగ్ నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో 4 వేల ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొందన్నారు.
వైఎస్సార్ పైసా పన్ను విధించకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారని విజయమ్మ గుర్తు చేశారు. ప్రతి మనిషికి భరోసాయిచ్చారని తెలిపారు. తెలుగువారందరి గుండెలో ఆయన ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లిన వైఎస్సార్ అమలు చేసిన పథకాల గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. వైఎస్ అంటే ఓ నమ్మకం, ఓ భరోసా అని పేర్కొన్నారు. వైఎస్సార్ పేరు రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిందన్నారు.
జగన్ త్వరలోనే బయటకు వస్తాడని విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జై జగన్ అంటూ అభిమానులు, కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేయడంతో సభాప్రాంగణం హోరెత్తింది. ఈ నినాదాలు పాలకులకు వినబడి కళ్లు తెరవాలని అన్నారు. దీంతో ముందుంది మంచికాలం అంటూ విజయమ్మ భరోసా ఇచ్చా - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=638242&Categoryid=14&subcatid=0#sthash.xwA2C6iK.dpuf
పాలకుల మొద్దు కారణంగా విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేయాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మంజూరులో మాత్రం చేతివాటం చూపుతోందని విజయమ్మ ఆరోపించారు. ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీలకు కౌన్సెలింగ్ నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో 4 వేల ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొందన్నారు.
వైఎస్సార్ పైసా పన్ను విధించకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారని విజయమ్మ గుర్తు చేశారు. ప్రతి మనిషికి భరోసాయిచ్చారని తెలిపారు. తెలుగువారందరి గుండెలో ఆయన ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లిన వైఎస్సార్ అమలు చేసిన పథకాల గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. వైఎస్ అంటే ఓ నమ్మకం, ఓ భరోసా అని పేర్కొన్నారు. వైఎస్సార్ పేరు రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిందన్నారు.
జగన్ త్వరలోనే బయటకు వస్తాడని విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జై జగన్ అంటూ అభిమానులు, కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేయడంతో సభాప్రాంగణం హోరెత్తింది. ఈ నినాదాలు పాలకులకు వినబడి కళ్లు తెరవాలని అన్నారు. దీంతో ముందుంది మంచికాలం అంటూ విజయమ్మ భరోసా ఇచ్చా - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=638242&Categoryid=14&subcatid=0#sthash.xwA2C6iK.dpuf
0 comments:
Post a Comment