వైఎస్ఆర్ సిపి అభ్యర్థులను బెదిరిస్తున్నారు:మైసూరా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సిపి అభ్యర్థులను బెదిరిస్తున్నారు:మైసూరా

వైఎస్ఆర్ సిపి అభ్యర్థులను బెదిరిస్తున్నారు:మైసూరా

Written By news on Sunday, July 14, 2013 | 7/14/2013

స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను అధికార కాంగ్రెస్ పార్టీ వారు బెదిరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్వవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరా రెడ్డి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను బెదిరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. అధికారుల సాయంతో ఇతర పార్టీ సర్పంచ్ నామినేషన్లను ఉపసంహరించుకునేలా బెదిరింపులకు పాల్పడుతోందన్నారు.

నేర చరిత్రగల వారు ఎన్నికలలో పోటీచేయకుండా ఉండాలన్న ఉద్దేశం మంచిదేనన్నారు. అయితే సుప్రీం కోర్టు ఈనెల 11న ఇచ్చిన తీర్పును కూడా ఈ ప్రభుత్వం వక్రీకరించేందుకు పన్నాగం పన్నిందన్నారు. పోలీసులు అధికారుల చేతిలో కోర్టు తీర్పు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నామినేషన్ల సమయంలో నిజాయితీ పరులపై కూడా కేసులు పెడుతున్నారన్నారు. తనకు తెలిసినంత వరకు కాంగ్రెస్, టీడీపీ కలిసే పోటీ చేస్తున్నాయన్నారు. 
Share this article :

0 comments: