రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. రాబోయే పంచాయతీ ఎన్నిలు పార్టీ ప్రాతిపదికన జరిగేవి కావని లేఖలో ప్రస్తావించారు. ఈ ఎన్నికలు సంక్షేమాన్ని కోరుకునే శక్తులకు, వ్యతిరేకించే శక్తులకు మధ్యేనని ఆమె తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పాలనలో సువర్ణయుగం నడిచిందని, అంతకు ముందు ఆ తర్వాత కూడా శూన్యయుగాన్ని చూస్తున్నామన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధి నిరోధక పార్టీలని, పన్నులు పెంచి ప్రజలను అగచాట్లకు గురిచేయడమే వారి లక్ష్యమని విజయమ్మ విమర్శించారు. విశ్వసనీయత, వంచన మధ్య జరుగుతున్న ఎన్నికలగా ప్రజలు గుర్తించాలన్నారు. ఈ ఎన్నికలు వైఎస్సార్ సువర్ణయుగ స్థాపనకు ముందడుగా భావించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించడానికి పార్టీ శ్రేణులన్నీ సమరశంఖం పూరించాలని విజయమ్మ లేఖలో పేర్కొన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధి నిరోధక పార్టీలని, పన్నులు పెంచి ప్రజలను అగచాట్లకు గురిచేయడమే వారి లక్ష్యమని విజయమ్మ విమర్శించారు. విశ్వసనీయత, వంచన మధ్య జరుగుతున్న ఎన్నికలగా ప్రజలు గుర్తించాలన్నారు. ఈ ఎన్నికలు వైఎస్సార్ సువర్ణయుగ స్థాపనకు ముందడుగా భావించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించడానికి పార్టీ శ్రేణులన్నీ సమరశంఖం పూరించాలని విజయమ్మ లేఖలో పేర్కొన్నారు.
0 comments:
Post a Comment