వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాతయాత్ర 203వ రోజు (జిల్లాలో తొలి రోజు) సాగే వివరాలను పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారా వు, పార్టీ విజయనగరం జిల్లా కన్వీనర్ పెనుమ త్స సాంబశివరాజు ఆదివారం ప్రకటించారు. షర్మిల సోమవారం సాయంత్రం 4 గంటలకు కొత్తవలస మండలంలోని చింతలపాలెం వద్ద జిల్లాలో అడుగుపెడతారు. అక్కడినుంచి దేశపాత్రుని పాలెం, మంగళపాలెం గ్రామాల మీదుగా పాదయాత్ర సాగించి కొత్తవలస జంక్షన్కు చేరుకుంటారు. కొత్తవలస జంక్షన్లో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కొత్తవలసలోనే బస చేస్తారు.
జిల్లాలో తొలిరోజు పర్యటించే ప్రాంతాలు
చింతలపాలెం, దేశపాత్రునిపాలెం, మంగళపాలెం, కొత్తవలస
జిల్లాలో తొలిరోజు పర్యటించే ప్రాంతాలు
చింతలపాలెం, దేశపాత్రునిపాలెం, మంగళపాలెం, కొత్తవలస
0 comments:
Post a Comment