Home »
» విజయమ్మను కలిసిన మంథని సర్పంచ్ శైలజ
విజయమ్మను కలిసిన మంథని సర్పంచ్ శైలజ
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా మంథని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం గ్రామపంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన పుట్టా శైలజ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మను కలుసుకుని ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలో జరిగిన ప్రతిష్టాత్మకమైన పోరులో శైలజ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆమె భర్త, కరీంనగర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పుట్ట మధు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్తో కలిసి శైలజ సోమవారం విజయమ్మ వద్దకు వచ్చారు. విజయమ్మ ఆమెను అభినందించి పంచాయతీ పరిధిలో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పుట్ట మధు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మంథని ప్రజలు మంత్రి శ్రీధర్బాబు అరాచకాలకు విసిగిపోయారని, అందుకే వైఎస్సార్సీపీ పక్షాన శైలజను భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు.
0 comments:
Post a Comment